Wednesday 28 May 2014

తొలి పద్యశాసనం.

 తొలి పద్యశాసనం.
- కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్ 
03.01.2014

తొలి పద్యశాసనం..ప్రకాశం జిల్లా అద్దంకి లోనిది...
తొలి తెలుగు పద్యం పుట్టిన గడ్డగా చారిత్రక సాహిత్య నేపథ్యాన్ని కలిగిన శాసనం గురించి కొన్ని విషయాలు...
చైన్నై ప్రభుత్వం మ్యూజియంలోని మాతృకకు ఈ ఫొటోలోని శాసనం ప్రతికృతి.
క్రీ.శ 848 (శా.శ 770)కి సంబంధించిన ఈ శాసనం వేంగీ చాళుక్య లిపిలో ఉంది. చారిత్రక ఆధారాలననుసరించి దేశీయమైన తొలి తెలుగుపద్యాన్ని అందించిన శాసనం ఇది. గ్రామాధికారి కీ.శే కాకాని కోటయ్య గారికి వేయిస్తంభాలగుడి పరిసరాల్లో ఈ శాసనం లభించింది. నెల్లూరు శాసనాల సంకలన గ్రంధంలో కీ.శే అలెన్ బటర్ వర్త్ గారు కీ.శే వేణుగోపాల చెట్టి గారు 1905 లో తొలుత దీనిని ప్రచురించారు. ఈ శాసనంలో తరువోజ పద్యం వుందన్న విషయాన్ని గమనించి ప్రకటించినవారు..కీ.శే కొమర్రాజు లక్ష్మణరావు పంతులు గారు. ప్రముఖ సాహితీ వేత్త కీ.శే వేటూరి ప్రభాకర శాస్త్రి గారు ఈ శాసనాన్ని భద్రపరచటానికి కృషిచేశారు. ప్రఖ్యాత భాషా పరిశోధకులు కీ.శే బూదరాజు రాధాకృష్ణ గారి 'ప్రాచీనంధ్ర శాసనాలు ' గ్రంథం యథాతథ పాఠాన్ని ప్రముఖ శాసనభాషా పరిశీధకులు కీ.శే జయంతి రామయ్య పంతులు గారి ' శాసన పద్య మంజరి ' గ్రంథం నుంచి సవరణ నేటి తెలుగులో కొలువై వున్నది పండ రంగడి అద్దంకి శాసనం అద్దంకిలో. పండరంగడు పరమ మహేశ్వరుండను ఆదిత్య భట్టారకునికి ఇచ్చిన భూమి వివరాలు ఈ పద్యంలో చక్కగా వివరించబడినవి.
నేను ఈ రోజే వెళ్ళి చూసిన... పండరంగడి అద్దంకి శాసనం లిపి.. నేటి తెలుగు లిపి ల చిత్తరువులు ఐదు పోస్ట్ చేస్తున్నాను..
'అచ్చంగా తెలుగు ' తొలి పద్యాన్ని చదివి ...ఆనందిస్తారని ఆశిస్తూ ....! 

          

No comments:

Post a Comment