Wednesday 25 February 2015

దేశం లోనే గొప్ప ఆలయం ఇదేనేమో..?

     ఎంతో విశాల దృక్పధానికి ఆలవాలమైన ఈ ఆలయం ని దర్శించుకున్న వాళ్ళేవరన్నా ఉంటే వారి కాళ్ళు మ్రొక్కాలని వుంది.
ఇంతకీ ఇదేం ఆలయమో ఎవరైనా చెబుతారా?? 







గుర్తుపట్టారా?

??

???

???

????

?????
ఇది దేవాలయం అనుకుంటే అడుసు తొక్కినట్లే.. అంతకన్న పవిత్రమైనదే మరి..??

.....
.....

......


....

....

.........

ఇది ఒక ముద్రణాలయం...

*************
******************
***********************
*****************************
***********************
******************
*************








        భారతీయత.. భారతదేశ ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లుతూ... కేవలం భారతీయ సంస్కృతి పరిరక్షణ కోసం స్థాపించబడి 92 ఏళ్ళు గా అవిరళ కృషి చేస్తున్న ధార్మిక సంస్థ గీతా ప్రెస్. ప్రపంచంలో అత్యధికంగా హిందూ సంబంధమైన పుస్తకాలు అనేక భాషల్లో అతి తక్కువ ధరకే అందిస్తున్న సంస్థ ఇది. నిజంగా దేవాలయాన్ని తలపిస్తున్న ఈ గీతా ప్రెస్ 1923 ఏప్రియల్ 29 న జయదయాళ్ గోయంక ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లో స్థాపించారు. వీరి ఆధ్వర్యంలో గీతాప్రెస్, గోవిందభవన్ ,  గీతా భవన్, వేదపాఠశాల, ఆయుర్వేదిక్ ఔషదాలయ  సేవాదళ్ వంటి సంస్థలు ద్వారా అనేక ప్రాంతాలలో   హిందూ సంస్కృతికి కృషిచేస్తూ.. సనాతన ధర్మాల ఉనికిని కాపాడుతున్నారు. గీతా ప్రెస్ నుంచి పలు భాషల్లో వస్తున్న 'కళ్యాణ్ ' అనే పత్రికకు లైఫ్ టైం ఎడిటర్ గా తొలి ఎడిటర్ హనుమాన్ ప్రసాద్ పొద్దార్ గారి పేరే కొనసాగుతుంది. శ్రీమద్భగవద్గీత, రామాయణం, దుర్గా సప్తసతి, పురాణ , ఉపనిషత్తుల వంటి పుస్తకాలు ఇప్పటి వరకూ 370 మిలియన్ కాపీలను ఈ సంస్థ ప్రచురించింది. అయినా సరైన గుర్తింపుకు నోచుకోక పోవడం దురదృష్టం కదా..//

నమోస్తు గీతా ప్రెస్
నమోనమ: గీతాప్రెస్
నిత్య సేవికా వందనం
నిరంతర శ్రామికాభివందనం

               - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్
                           26.02.2015

No comments:

Post a Comment