Saturday, 5 March 2016

'విశ్వ'నాధ దర్శనం...1

'విశ్వ'నాధ దర్శనం...1
                                                                                        _ కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్,03.03.2016

గంగా తరంగ రమణీయ జటా కలాపం
గౌరీ నిరంతర విభూషిత వామ భాగం |
నారాయణ ప్రియం అనంగ మదాపహారం
వారాణసీపురపతిం భజ విశ్వనాథం ||

సర్వేశ్వరుని నేరుగా దర్శిస్తే ఎలా ఉంటుంది.. ఊహే పులకింత కలిగిస్తోంది కదూ.. నిజమే నేను సర్వేశ్వరుని కలిసే భాగ్యం ఈ లీపు సంవత్సరం అందించింది. నా కొద్దిపాటి పాఠవంతో.. వారి గురించి క్లుప్తంగా...!



కాశీనాధుని వారు..  
కల్లాకపటం లేని వారు
కళలకు కాణాచి వీరు
కదిలే విద్వత్తుల మేరు
కాసేపు ముచ్చట చాలు..
అండ పిండబ్రహ్మాండంబుల
దర్శనమే ముంగిట వాలు.!
పలికే పలుకులు
'సాగర సంగమ' దృశ్యకావ్యాలు  

ఆ ముసిముసి నగవులు
మెరిసేటి 'సిరివెన్నెల' జిలుగురేఖలు.
ఆ ప్రేమనిండిన మాటల్లోని 
'శృతిలయలు'...
ఎదలోని భావతరంగాలను సవరించేటి
"సిరిసిరిమువ్వ"ల సవ్వడులు
'శంకారభరణ'మైన 
ఆ నిలువెత్తు రూపం..
నటరాజు మ్రోల
'స్వర్ణకమలం'..
కదిలిస్తే కథల వరద..
కదిలించేటి మనుసులోతు పొర
కళ్ళల్లో తొంగిచూసేటి నిండైన'ఆత్మగౌరవం'
అనాచారాలను నిష్కర్షగ దూనమాడే  
'సప్తపది' అడుగులు..
అమాయకత్వంతో ఇజాన్ని మార్చిన 
'స్వాతిముత్యపు' చిందులుతో
మెరిపించి,మైమరపించిన ఠీవి..! కళాతపస్వి..!!
మనుషుల్లో మార్పుకోసం సినిమా వేదికగా
తపన పడీ, వెలిగిన 'స్వయంకృషీ'వలురు..
వారి 'శుభసంకల్పం'తో..
'ఆపద్భాందవుడు'లా, 
సినీచరిత్ర గతి మార్చిన వైనం
ఎందరికో మార్గదర్శకం..
జాతీయ అవార్డుల 'శుభలేఖ'లు 
తెలుగు సినిమా వాకిళ్ళకు 
తోరణాలుగ జేసిన తేటతెలుగు 'స్వాతికిరణం'
వారే నా హృదయ పీఠాన కొలువైన రూపం.
వారే వారే 'కాశీనాధుని విశ్వనాథ్'ల వారనే బృహత్కావ్యం. 
                                                    - కరణం 29.02.2016


సరే..! ఈ ఆనంద పరవశానికి కారణం.. ఫిబ్రవరి 29 మధ్యాహ్నం 12.30 సమయంలో నేను సాక్షాత్తూ కాశీ విశ్వేశ్వరుని రూపంలా ఠీవిగా ఉన్న 'కళాతపస్వి కాశీనాధుని విశ్వనాథ్ గారిని దర్శించుకున్న క్షణాలు.. షుమారు 3600 క్షణాలు..ఊపిరి బిగబట్టి, జాలువారే అక్షర జలపాతం లోంచి పదమనే ముత్యాలను ఏరుకుంటూ.. అలా గడిపేశానంతే..! ఆ అదృష్టం.. నాకు కలగటం సుకృతమే కదూ..!

అమ్మహామహుని కలిసిన అద్భుతం ఎలా జరిగింది?  
------------------------------------------------

కళాతపస్వి ని కలుసుకోవాలన్న ఆలోచన వచ్చిన రోజు అనుకోకుండా ఒక ఘటన జరిగింది.. ప్రముఖ దూరదర్శన్ ప్రెజెంటర్ విజయదుర్గ గారి తో ఒక టెలిఫిల్మ్ విషయమై మాట్లాడుతూ.. విశ్వనాథ్ గారితో వారు చేసిన  ఇంటర్వూ.. "సంగీత, సాహిత్య సమలంకృతం .. విశ్వనాధ అంతరంగం" గురించి, ప్లేబ్యాక్ సింగర్ పార్ధసారధి గారు చేస్తున్న 'విశ్వనాధామృతం' లు డిస్కషన్ లోకి వచ్చాయి.. మాటలు సాగుతుండగా"విశ్వనాథ్ గారంటే అంతిష్టమా మీకు" అన్నారు విజయదుర్గ గారు...

కాదని అనగలరా ఎవరైనా..? "నేను త్రిమూర్తులను కలవాలని"ఉన్న నాకోరిక ను బయట పెట్టాను. అందులో ఒకరు కాశీ విశ్వేశ్వరుడు...! ఆ మాటలు జరిగినప్పుడు మేడం విజయదుర్గ గారు అమెరికాలో అనుకుంటా వున్నారు.


ఒక వైపు పెళ్ళి, మరో వైపు పిలుపు..     
-------------------------
మిత్రుడు ( Srikanth Kanam ) శ్రీకాంత్ , బ్రహ్మణిల వివాహము చూతుమురారండి.. అంటూ మన ముఖ పుస్తక మిత్రులైన వారంతా పిలిచేసరికి హైద్రాబాద్ వచ్చా..! హైద్రాబాద్ వచ్చినప్పుడు విజయదుర్గ గారికి ఫోన్ చేసి మాట్లాడా కర్టసీగా..! మధ్యాహ్నానికి అకస్మాత్తుగా విజయదుర్గ గారి నుంచి ఫోన్.. రేపు హైద్రాబాద్‌లోనే ఉండండి.. విశ్వనాథ్ గారి వద్దకు వెళ్తున్నాం. ఇదీ వారి ఫోన్ అందించిన సందేశం.. మూడు నాలుగు నెలల క్రితం విజయదుర్గ గారు అమెరికాలో ఉన్నప్పుడు మాట్లాడిన విషయాన్ని గుర్తుపెట్టుకుని, అకస్మాత్తుగా అవకాశం కల్పించడం 
గొప్పవిషయం కదా..వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతాంజలి.

మరోవైపు ........
గోటేటన్న (Venkateswara Rao Goteti) వస్తారు రిసెప్షన్ కి రమ్మని శ్రీకాంత్.. మనోహర్ ( Manohar Borancha ) సారు..! ఏంచేయాలో, అర్ధం కాని పరిస్థితుల్లో గురువుగారు మనోహర్ గారు..విషయం తెలుసుకున్న వారై, "విశ్వనాథ్ గారి వద్దకే వద్దకే వెళ్లవోయ్..అలాంటి అదృష్టం మరోసారి రాదు "అన్నారు..   


ఇక తర్వాత రోజు హడావుడిగా మా తమ్ముడు వాళ్ళు నివాసం ఉండే నిజాంపేటలో బయలుదేరి.. బస్   

పట్టుకోవడానికి వెంటపడి కుక్కట్‌పల్లి దాటాక బస్ ఎక్కి... దిల్షుక్ నగర్ చేరి అక్కడ నుండి విజయదుర్గ గారింటికి వెళ్ళే సరికి అప్పటికే ఆలస్యమైందేమో ..రోడ్ పైనే నాకోసం కార్లో వెయిట్ చేస్తూ ఉన్నారు విజయదుర్గ గారు.. అప్పటికి ఎంతసేపటి నుంచి వేచి చూస్తున్నారో నాకైతే తెలీదు.. అడిగే ధైర్యమూ చేయలేదు..

వారి సీరియస్ ఫేస్ చూసి సారీ చెప్పా..!  అంతకు మినహా నేను ఏమీ చేయలేను.. అంతా హైద్రాద్  సిటీ బస్సు మహిమ..!  వారి కారు దూసుకుంటూ ట్రాఫిక్ బూజు దులుపుకుంటూ నేరుగా వెళ్ళి ఫిలిం నగర్ లోని ఒక ఇంటి ముందాగింది.. 


అక్కడ అడుగు పెట్టామో లేదో.. 'సిరివెన్నెల'  మురళి గానం మనసును లీలగా తాకింది..   
'స్వర్ణకమల'పు అందెల రవళి, నా హృదయం పై నృత్యం చేసింది..  సప్తస్వరాలు 'స్వాతి కిరణ' రేణువులై మేను తాకి పులకరింపజేశాయి.. ఎక్కడనుంచో.. 'సువ్వి సువ్వి' అని లీలగా వినపడుతున్న భావన..  ఏమీ అర్ధం కావటం లేదు.. ఇంటి ముందు "కాశీనాధునీస్" అన్న పేరు చదువుతూనే పరవశాన విజయదుర్గ గారిని అనుసరించా..! నా కాళ్ళు నా స్వాధీనం లో లేవు. ..."గాల్లో తేలిపోతున్నాయని వేరే చెప్పఖ్ఖర్లేదనుకుంటా".>!.😊
                                                                                      ..........(ఇంకా వుంది)

సినీదర్శక స్రష్ట విశ్వనాధ్ గారి తో చర్చా గోష్టి వివరాలు మరల అందిస్తాను.._                                                                                                                                                                                                                    _  మీ కరణం..

Friday, 5 February 2016

//ఎందరో మహానుభావులు అందరికీ వందనము...//

//ఎందరో మహానుభావులు అందరికీ వందనము...//
              నేను అందరినీ ఇంటర్వూ చేసే ఒక మీడియా ప్రతినిధిని, ప్రకాశం జిల్లా జెమిని న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ గా పనిచేస్తున్న నన్ను, మాలిక పత్రిక ఎడిటర్లలో ఒకరైన డా. సత్య గౌతమి గారు ఇంటర్వూ చేశారు.
హహహ..!
కొత్తగా ఉంది కదూ.. అవునండీ నిజమే.. !

              ఇటీవల ప్రకాశం జిల్లాలో మేము తీసి, మా జెమినిన్యూస్ చానల్ యాజమాన్యం ప్రసారం చేసిన "అమ్మ..నాన్న దూరమైతే..!" కథనానికి యునిసెఫ్ అవార్డ్ వరించింది.. ఈ అవార్డ్ ను రిపోర్టర్ గా నేను నాతో పాటూ, మా జెమినిన్యూస్ సబ్ ఎడిటర్ బెహరానందిని గారు కలిసి 2015 డిసెంబర్ పదవతేదీ హైద్రాబాద్ తాజ్ లో అందుకున్నాం..

            అగమ్యగోచరంగా మారుతున్న చిన్నారుల జీవితాలపై నేను అందించిన "అమ్మ నాన్న దూరమైతే..!" కథనం, యునిసెఫ్ అవార్డ్ గెలుచుకున్న సందర్భంలో డా. సత్య గౌతమి (యు.ఎస్.ఎ) వారు అబినందించేందుకు, నన్ను సంప్రదించి అనేక విషయాలపై నాతో చర్చించారు. ఆ చర్చ ఈ నెల మాలిక పత్రికలో ప్రచురించారు..
మిత్రులారా..!
వీలు చూసుకుని ఒకసారి నా ఇంటర్వూని చదివి మీ అమూల్యమైన సందేశాన్ని అక్కడే ఉన్న కామెంట్ బాక్స్ లో తెలుపగలరు.. ఇంటర్వూ కోసం ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయగలరు.
                                                                                 - మీ కరణం


లింక్ :

http://magazine.maalika.org/2016/02/04/%E0%B0%AF%E0%B1%82%E0%B0%A8%E0%B1%80%E0%B0%B8%E0%B1%86%E0%B0%AB%E0%B1%8D-%E0%B0%85%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A1%E0%B1%81-%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B9%E0%B1%80%E0%B0%A4/





//కంటికి రెప్పవన్నారు..?//

//కంటికి రెప్పవన్నారు..?//
                            కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్ 
                                       01.02.2016, 11.20


రెప్పలా కాచేవారన్నారు..
దీపానికి చేతుల్లా కాపాడేవారన్నారు..
ఇదా.. 
ఇదా
ఇదా.. 
మీ తల్లిదండ్రులు మీకు తాపిన ఉగ్గు..
సిగ్గు..సిగ్గు
ఇదీ మీ గురువులు మీకు నేర్పిన పాఠం.. 
వద్దు వద్దు..
బొడ్డుతో ముడిపడ్డ నీకు అమ్మ ఇచ్చిన రక్తమేది..?
చేయిపట్టుకు, నాన్న నేర్పిన అడుగుజాడల జాడలేవి..?
ఇదా బ్రతుకు..ఇదా నడత..
జాతి భవితకు వెలుగురేఖలన్నది మరచి..
రాబందుల రెక్కల దాగి ..
ఇదా బ్రతుకు ఇదా బ్రతుకు
సిగ్గు సిగ్గు

ఎవడికి వాడే గోరీ కడతారా..?
ఎవడి ఆస్తిని వాడే, అగ్నికీలల ఆహుతిస్తారా..?
ఎవరి తల్లిని వాడు చెరిచేస్తాడా..??
ఏ గ్రంధం వినిపించింది ఆగ్రహనాదం..? 
ఏ చరిత్ర చూపించిందీ విచ్చలవిడి మార్గం..?
ఎక్కడిదీ బ్రతుకు.. 
సిగ్గు సిగ్గు

పరిగెత్తే గర్భవతి నీ చెల్లేమో అనిపించదా..
వడివడిగా అడుగులేసె తాత చూడగ, మీ తాతలు గుర్తురాలా..??
గుండెలవిసి ఏడ్చే ఒడి బిడ్డ, మీ బిడ్డలా కనిపించదా..?
ఆటవికులం కాదు మనుషులం.. అదన్నా.. అసలు గుర్తుందా..?
ఇదా బ్రతుకు..ఇదా నడత...
సిగ్గు సిగ్గు

నిలువెత్తు భయపెట్టడమా ఉద్యమం..
ఆస్తుల విధ్వంసమా ఉద్యమం..
ఆప్తుల ఆర్తనాదాలా ఉద్యమం..
ఏ పుట.. నేర్పుతోందిరా మీకీ పాఠం.. 
ఏ పూటా తిండి లేని నీకెందుకురా ఉబలాటం..

దగ్ధమయ్యే ఆ ఇనుప చువ్వలకు ప్రాణముంటే..
మండే కీలలు, కళ్ళల్లో నింపుకుని ...
నీ గుండెలు చీల్చేవేమో..!
నీలో భయం పుట్టించేవేమో..!!
నీకు గుణపాఠం చూపేవేమో..!!!
                                  - కరణం
                                     

( రిజర్వేషన్ పేరుతో తుని లో రైలు దగ్ధం చేసిన క్షణాలు కలవరపరచి)

Saturday, 30 January 2016

ఒక్కలుక్కేయండి.. దేశంలో ఏం జరుగుతోందో..

ఒక్కలుక్కేయండి.. దేశంలో ఏం జరుగుతోందో..
                                                        - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్ 
                                                                                  28.01.2016



హాట్స్ అఫ్ జస్టిస్ నర్సింహారెడ్డి గారు!

మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై జస్టిస్ నర్సింహారెడ్డి తీవ్రంగా స్పందించారు. "అక్బరుద్దీన్ మాట్లాడిన వీడియోలను నేను యూట్యూబ్‌లో చూశా. దారుణమైన వ్యాఖ్యలు ఉన్నాయి. రాముడి తల్లి ఎక్కడెక్కడ తిరిగి రాముడికి జన్మనిచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. అత్యధిక మంది ఆరాధించే భగవంతుడి విషయంలో ఇటువంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారు? అలాంటి మాటలు ఎలా అనగలిగారు? అరే హిందుస్థానీ అంటూ కూడా సంబోధించారు. మరి ఆయన ఉండేది ఎక్కడ? హిందుస్థాన్‌లో కాదా? 15 నిమిషాలపాటు పోలీసులను పక్కన పెడితే 100 కోట్ల మంది హిందువుల అంతుచూస్తాడట..! నాకున్న పరిధి మేరకు పోలీసులను 15 నిమిషాలు కాదు అరగంటసేపు ఆపుతా. ఏం జరుగుతుందో చూస్తాం. అందరినీ చంపేస్తారా" అని ప్రశ్నించారు. ఆయనపై హత్యాయత్నం జరిగినప్పుడు కాపాడింది పోలీసులేనన్న సంగతిని మర్చిపోయినట్లున్నారని వ్యాఖ్యానించారు. "ఆ ప్రసంగం ద్వారా అక్బరుద్దీన్ ఈ దేశానికే సవాలు విసిరాడు. ఆ సవాలుపైనే నిలబడమని చెప్పండి. దాని నుంచి వెనక్కి ఎందుకు తగ్గుతున్నట్లు? అక్బర్ ప్రశాంతంగా కూర్చొని ఆయన మాట్లాడిన వీడియోను చూడమని చెప్పండి. ఎంత పెద్ద తప్పు చేశారో తెలుసుకుంటారు. ఈ దేశం నుంచి పోయేటప్పుడు చార్మినార్, గోల్కొండ, కుతుబ్‌మినార్ తీసుకుపోతాడట. భారతదేశమంటే ఈ మూడేనా? ఈ మూడు లేకుంటే దేశం లేదా? ఈ దేశం ఆయన తండ్రిని ఎంపీని చేసింది. ఆయన సోదరుడినీ ఎంపీని చేసింది. ఆయన్ని మూడుసార్లు ఎమ్మెల్యేగా చేసింది. మరి ఈ దేశానికి వారు ఇచ్చేది ఇదేనా? ప్రతి స్పందనకు ప్రతిస్పందన ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. అక్బర్‌పై హత్యాయత్నం జరిగినప్పుడు ఆయన ఆరోగ్యం కుదుటపడాలని కులమతాలకు అతీతంగా ప్రార్థించారు. ఆయన మాత్రం ఈరోజు ఇలా మాట్లాడుతున్నారు. ముస్లింలదరూ ఆయన చెప్పిన దారిలో నడుస్తారని ఆయన భావిస్తున్నారా" అని ప్రశ్నించారు.

జస్టిస్ నర్సింహారెడ్డి గారు మొదటినుండి దమ్మున్న మనిషని నిరూపించుకుంటూనే ఉన్నారు. కరెక్ట్ గా కడిగారు అక్బరుద్దీన్ ని! ఏ రాజకీయ నాయకుడు, ఏ రాజకీయ పార్టీ ధైర్యం చెయ్యనంత దుమ్ము దులిపారు. హాట్స్ అఫ్ జస్టిస్ నర్సింహారెడ్డి గారు!

********************************************************************
I LOVE MY INDIA

అవును భారతదేశంలో ఉంటూ..భారతీయున కష్టఫలాలను పథకాల రూపంలో అనుభవిస్తూ.. భారతీయుల్లో అత్యధికులని మీరనే హిందువుల మనోభావాలను ఎందుకు కించపరుస్తున్నారు.... ఒకచచ్చినోడు వివేకానందుడీని దూషిస్తాడు.. మరొకడు మనువును ధూషిస్తాడు...

అంబేద్కర్ ఈ నాటి మనువైనప్పుడు.. మనువునెలా దూషిస్తారు..

ఆనాటి సామాజిక పరిస్థితుల దృష్ట్యా అప్పటి చట్టాలు ఆయన లిఖించారు.. ఇప్పటి సామాజిక పరిస్థితులు అవసరతల దృష్ట్యా అంబేద్కర్ చట్టాలు చేశారు.. మా అందరి దృష్టిలో అంబేద్కర్ అభినవ మనువు... చెవుల్లో సీసం పోసుకున్న మీకు అది అర్ధం కాదు...    


అయినా అక్భరుద్దీన్ ..అంత అంత కూతలు కూసినా నాలిక కోయకుండా మూసుకుని కూర్చున్నారంటే.. నీకో నీ వారికో భయపడి కాదు... కేవలం హిందువుల రక్తంలోని సహనం వల్లే...తెలుస్కో..

ప్రపంచమే మోకరిల్లే వివేకానందుని దూషించిన వాడినీ క్షమించారంటే..చేతకాక గాదు కేవలం చట్టాల పని చట్టం చేసుకుపోతుందని అంబేద్కర్ వ్రాసిన చట్టాలను గౌరవించి మాత్రమే...

పరమత సహనం చచ్చిపోయిన వాళ్ళూ... దేశభక్తి లేని వాళ్ళూ దేశం విడిచి పోండి...

నా దేశంలో మేమంతా కలిసే తిరుగుతున్నాం.. కలిసే తింటున్నాం.. కలిసే బ్రతుకుతున్నాం... అతడు క్రైస్తవుడా .. ముస్లిమా..అనే బేధాలు మేమెప్పుడో మరచిపోయాం.. మమ్మల్ని విడదీసే ప్రయత్నాలు మానుకోండీ... శవాల దగ్గర మరమరాలుశేరుకోవటానికి స్వస్తి పలకండి...

నాదొక చిన్న అనుమానం మేం కలసి ఉండటం మీకెందుకు కంటకింపో అర్ధం కావట్లేదు... మొన్నటి దాకా వేరు చేశారని అన్నారు.. మరి కలిసి పెరుగుతుంటే మీ కొచ్చే నష్టం ఏవిటీ...

నావరకూ చెప్పాలంటే ...
 దళితులు అన్న వారే నాకెక్కువ మిత్రులు..."ఏరా కరణం" అనే చనువున్న 'కబ్బడు' కూడా నా మిత్రుడే.. రూఫస్ దంపతులు మా ఇంట్లో ప్రతి. కార్యక్రమంలో ఉండాల్సిందే.. ..

ఏలియా... బాబూ, లిక్కడు, రవి ..దిలీపులు ...జాజబాబు.. ఇలా ఎందరో నాతో కలిసో ..నేను వారితో కలిసే తిరిగాం. తిరుగుతున్నాం.. వారిళ్ళలో ఫంక్షన్ లకు మా ఇంటికి వచ్చి పిలుస్తారు.. డా.కోటేశ్వరరావు అంకుల్. కుటుంబం మా ఇంటిలో వారే... నాతోనే ఉండే మట్టిలోని మాణిక్యం.

ఎల్లైసీలో పనిచేసిన రఫీ కుటుంబం మా ఇంట్లో పదేళ్ళు అద్దెకున్నారు.. వారి పిల్లలు మా పిల్లలతో కలిసి పెరిగారు.. నాలుగంగళాల గోడ మాత్రమే అడ్డు... మాకు మాంసం వాసన పడదని వారు మాంసం బయట  తినే వారు.
మా ఇంట్లో శ్రీరామనవమి కళ్యాణం జరుగుతుంటే వారు పుట్టింటి వారిలా చీరె సారెశపెట్టే వారు...

ఉదయాన్నే బాపట్ల ఆలీ బాబాయ్ కాల్ చెయ్యక పోతే.. నేను ఇంట్లోంచే కదలను...

 మతమంటే ప్రాణంగా భావించే బాష..నేను ఖురాన్ .. గీతల పై మంచి గురించి షేర్ చేసుకుంటుంటాం..
అంతెందుకు నాకు ఊహ తెలిసే సరికే మా పల్లెటూర్లో మా ఇంటి ప్రాంగణంలో బిబి ఉండేది.. మా బామ్మ గారి చివరి క్షణాల వరకు బిబి దగ్గరే ఉంది..

శ్రీరంగం ఆస్థాన విద్వాంసులు మహబూబ్ సుభాని, కాలేషా బీలను మేము బాబాయ్ పిన్ని అనే పిలుస్తాము...

నేను రూఫస్ ఒకే బ్లడ్ గ్రూప్ ఇద్దరం కలిసి చాలా మందికి రక్తదానం చేశాం వారందరిలో మా ఇద్దరి రక్తం కలిసే ప్రవహిస్తోంది... రూఫస్ తల్లి గారు , తండ్రీ గారు మంచిమతబోధకులు... వారిని వారి మతాన్ని మేంగౌరవిస్తాం మా మతానికి వారు విలువ నిస్తారు...

తల్లి గారికి అనారోగ్యంగా ఉన్నప్పుడు నా రక్తం ఆమెకి ఎక్కించారు..అంటే వారిలో నా రక్తం మిళితమయ్యే ఉంది.

నేను చదువుకునేటప్పుడు బందర్ లో నా రూం మేట్స్ విషయం ఇక్కడ ఖచ్చితంగా చెప్పి తీరాలి.. అలందర్ హుస్సేన్ (తాడేపల్లిగూడెం), బెనర్జీ (విశాఖపట్నం) నా రూం మేట్స్.. తలా ఒక బ్రాంచ్ కూడా.! కలిసే రెండేళ్ళు ఉన్నాం ఒకే రూంలో.

ఇలాంటివి చెప్పాలంటే కో కొల్లలు....

మా అమ్మగారూ నాన్నగారు మమ్మల్ని అలా పెంచారంటే వారి తరం ఇంకెంత గొప్పదో కదా...

ఇదంతా సెల్ఫ్ డబ్బా కొట్టుకోవటం కాదు వాస్తవం ..

ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే...

ఖచ్చితంగా మేమైతే మారాం..మీరే ఇంకా మానసికంగా నూతిలోనే ఉన్నట్లున్నారు.. మీరు ఎదిగి ఉన్నతులవుతున్నారని మేం భావిస్తున్నాం.. మిమ్మల్ని మీరే తక్కువ చేసుకుంటున్నారని నేను బల్లగుద్ది చెబుతున్నా..!

    పూర్వం మనందరి ఐకమత్యం ని ఎవడైతే తమ రాజకీయాల కోసం వాడుకున్నారో అలాంటి వారే మనల్ని విడదీసే ప్రయత్నం చేస్తున్నారు..

ఇప్పుడు చెప్పండి ఇది నా ప్రశ్నే కాదు నాలాంటి భావాలున్న కోట్ల మంది ప్రశ్నలు..

1. అసలు మమ్మల్ని కులమతాలకు అతీతంగా కలసి సమానంగా మనుగడ సాగించమంటారా లేదా...?

2. హిందువుల విషయంలో అత్యధికుల పేరుతో టామింగ్ పై దృష్టి పెట్టే మీడియా.. అక్బరుద్దీన్ ని స్టూడియోలో కూర్చో బెట్టి సవాల్ ఎందుకు విసరట్లేదు..? హిందువులకి మనోభావాలుండవా?

3. విద్యార్ధి మృతి చెందితే అతడి ముందు దళిత పదం మీడియా వాడటం ఎంత వరకూ సబబు... ఇది అంతర్గత లా అండ్ ఆర్డర్ మత విద్వేషాలు రెచ్చగొట్టే క్రియ కాదా...? వీరికి చట్టం పై గౌరవం ఉందా లేదా..?

4. మనువు వ్రాసిన ధర్మశాస్త్రాన్ని దగ్ధం చేస్తుంటే పోలీసులు ఎందుకు పుర్తిస్తాయిలో చర్య తీసుకోలేదు..? అదే ఇతర మతాల ధర్మశాస్తాల ను ఏవైనా అంటే పోలీసులు చర్య తీసుకోకుండా ఉంటారా??

5. పేరుకి , సర్టిఫికెట్లకి పథకాల సొమ్ములకి కావల్సిన హిందూ మతం... పక్కన నడిచి వెళ్ళడానికి ఎందుకు ఏహ్యం??

6.. సహనం చచ్చిన ఓ మేధావుల్లారా మీకు ఇవన్నీ ఎందుకు కనిపించటంలేదు...??

7.. మేముకలసి మెలసి జీవిస్తే మీకు భయమేస్తోంది కదూ..
అందుకేనా ఓట్ల కోసం విడదీయటం... ఆనక వదిలేయటం...??

8. దేశం అంటే ఇష్టం లేని వారు దేశం విడిచి వెళ్ళొచ్చు కదా...ఏ ఎందుకు చేయరు.. ఆస్తులు పోతాయనా..? అక్కడైతే చెమ్మ తీస్తారని భయమా..?

9. మత విద్వేషపు  ప్రచారం..ప్రసారం.. ప్రకటనలపై   బలమైన చట్టం రూపొందిస్తారా.. లేదా..?

10.ఇంతకీ నాలాంటి భావాల వారిని ఏంచేయమంటారు..?

నేను కోరుకునేది అంబేద్కర్ ఆశయ సాధన.. అందరూ సమానమే అనే గొప్ప భావన...అందుకోసం అందరం ఐకమత్యం గా ముందుకు సాగటం...
భారత్ మాత కి జై...
జై హింద్
_ మీ కరణం


Saturday, 23 January 2016

// న్యూ వర్ల్డ్ ...//

// న్యూ వర్ల్డ్ ...//
             - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్ 
                          21.01.2016.. 16.11  


కొత్త ప్రపంచం..కొత్త ప్రపంచం..
ఆశల వలయాల ఆవల..
ఈర్ష్యాద్వేషాలకు సుదూరాన.. 
నాలో నీవు నీలో నేనూ..
కవ్విస్తూ..మురిపిస్తూ..
మెత్తగా హత్తుకుని..
ఆ గాఢ పరిష్వగంలో
మైమరమరచి..
ఏకాకుల్లా ఏకమై.. 

ఎడారి ఒయాసిస్సు ఒడ్డున
అడుగులో అడుగేసుకుంటూ..
మంచు శిఖర చిటారు కొనపై..
ఊసులాడుకుంటూ..
శంబరమాటున మెరిసిపోతూ
శరధి నురుగై తేలిపోతూ ..
కరిగిపోతూ ..కలిసి పోతూ...
సవ్వడి ఎరుగని చీకటిలో..
కిరణం సంయోగించని చిట్టడవిలో..

ఒకరికొకరం ..
ఒకరై ఇద్దరం...
 చలించి జ్వలించి .. 
కేళీ విలాసాన
విజయపుటంచుల కేతనం ఎగురేయాలి...
కొంగ్రత్త ప్రపంచపు ఆది మనమవ్వాలి...
అంతవరకూ...నీవు నాతో ఉంటావు కదూ..
యు ఆర్ మై న్యూ వర్ల్డ్. 
లవ్యూ ఫరెవర్..._ నీ కరణం...
                                              21.01.2016.. 16.11

(చిత్రం గీసిన మహానుభావుడికి శిరస్సు వంచి నమస్సులతో.. గుగూల్ నుంచి..!! 
కవితకు చిత్రం వెదకటంలో సహకరించిన నా ప్రాణ మిత్రులకు కృతజ్ఞలతో..!- కరణం )

Monday, 10 August 2015

// మా ఇంట్లో ఓ శంకర్ దాదా..//

// మా ఇంట్లో ఓ శంకర్ దాదా..//
                                      - కె.కె. కృష్ణ కుమార్, 05.08.2015

ఎందరో మహానుభావులు అందరికీ వందనము... మా పెద్దోడు శ్రీరాంశరణ్ ఎంబిబిఎస్ చేరాడు.. ఒంగోలు లోని రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో.. వారం రోజుల టెన్షన్.. ఒకరికి కాదు ఇద్దరికి కాదు.. ఇంటిల్లిపాదిదీ ఇదే పరిస్థితి.. కారణం లేకపోలేదు..


మొదట తెలంగాణా కౌన్సిలింగ్ జరిగింది గత నెల 29 న తేదీన. తెలంగాణాలో మావాడు నాన్-లోకల్.. ర్యాంకు 196 మాత్రమే.. ఉస్మానియా వస్తుందనుకున్నాం.. కనీసం గాంధీ మెడికల్ కాలేజ్‌కూడా రాలేదు.. వరంగల్ లో వచ్చింది.. కానీ.. మేము సానుకూలంగాలేక వరంగల్ వద్దనుకున్నాం.. నో-ఆప్షన్ పెట్టేశాం.. ఆ నిర్ణయం తప్పు కావచ్చని ఆ క్షణం మాకు తెలీదు..
ఆం.ప్ర లో లోకల్ ..ర్యాంకేమో 967.. 
ఈరోజున ( ఆగస్టు 5 న)ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిలింగ్ కోసం ఏమౌతుందో తెలీక నానా ఇబ్బందీ పడ్డాం... సీట్ వస్తుందో రాదో అర్ధం కాని పరిస్థితి.. రిజర్వేషన్లు అన్నీ పోగా మిగిలిన వాటిలోనే రావాలని తెలిసి భయపడ్డాం.. లెక్కలు.. వగైరా లతో తల బొప్పి కట్టింది.. ఇక ఎదురుగా కౌంట్‌డౌన్ స్టార్ట్... ఒకొక్క సీటు ఐపోతూ.. భయపెట్టింది కంప్యూటర్ స్క్రీన్ ..
విశాఖ మేము లోనికి వెళ్ళకముందే పూర్తెపోయాయ్.. చూస్తుండగానే గుంటూరు, కాకినాడ, విజయవాడ సీట్లు హుష్ కాకి.. చివరకి గవర్నమెంట్ కాలేజీలో చేరాలన్న సంకల్పంతో ఒంగోలు రింస్ కాలేజీ లో చేరాడు శ్రీరాం..మావంశంలో రెండో డాక్టర్..

మా నాన్నగారి కల.. : మనుమడీని డాక్టర్ గా చూడాలన్నది, మా నాన్నగారు కరణం సుబ్బారావు గారి చిరకాల వాంఛ. ఇక ఆ వేటలో మా శ్రీరాం ఒంటరిగానే పోరాడాడని చెప్పాలి.. కేవలం మేము వాతావరణ కల్పించడం మినహా ఏమీ చేయలేదు.. ఇక ఎంట్రన్స్ సమయంలో .. భావరాజు పద్మిని గారు, వారి శ్రీవారు శ్రీ సతీష్ గారు బెంగులూరులో ఎంట్రన్స్ వ్రాయడానికి వెళ్ళినప్పుడు మాకు గెస్ట్ హౌస్ ఏర్పాటు చేసి సహకరించారు.. వారికి ఈ సందర్భంలో ప్రత్యేక కృతజ్ఞతలు.. ఇక మాయింటికి రండి అంటూ కొల్లూరు విజయశర్మగారూ, రేఖ గారూ కూడా ఆహ్వానించినా దూరం అవ్వడం వల్ల మేము భావరాజు సతీష్ గారు ఏర్పాటు చేసిన వసతి గృహాన్ని వినియోగించుకున్నాము.. కొల్లూరు విజయా శర్మ గారికి, Naveenrekha Ns మేడం గారికి కృతజ్ఞతలు.. ఇక సీట్ ల వేటలో సహకరించిన మా తమ్ముడి మామగారు శ్రీ ప్రసాద్ గారూ, మా ఫొటోగ్రాఫర్ మిత్రుడు శ్రీ శివరంజని సాయి (చీరాల)అన్నకు, మూర్తి గారు (ఆర్టిసి, ఒంగోలు )వారికి, మా శ్రీరాం స్నేహితుల పేరెంట్స్ అందరికీ పేరుపేరున నా ప్రత్యేక కృతజ్ఞతలు..
ఇక మాఇంట్లో సంబరాలు చేసుకోవాలి.. ఇక్కడ ఎవరి ఫేరైనా చెప్పడం మరచిపోతే తిట్టకండే.. ఆనందంలో మరిచిపోయానని క్షమించేయండే...
ఇక పాటేస్కుంటాం మరి.." శ్రీరాం శరణ్ ఎంబిబిఎస్.. ఊ..హ..ఊ..హ"
శుభసాయంత్రం - మీ కరణం





//తన కోసం...//

//తన కోసం...// 
                                                         _ కె.కె. కృష్ణ కుమార్, 09.08.2015
తను వస్తేనే తనువులు ..మనువాడినంత సంబరపడతాయ్
తను వస్తేనే కనులు.. సుషుప్త రెప్పల దుప్పటి తొలిగిస్తాయ్.
తను వస్తేనే మనసులు .. రెక్కలు తొడిగి రెపరెపలాడతాయ్..

తను వస్తేనే జీవులు.. సాగరన నావల్లే తేలిపోతాయ్..
తను వస్తేనే నేలమ్మ.. నేలమీదమ్మ లేత పాదాల గజ్జెలు ఘల్లు మంటాయ్...
లేత ఆకుల నుంచి ..
లేత కిరణాలు పంచి..
లేత మనసు ను గిలిగింతలెట్టే..
తను వస్తేనే.. 
సర్వం తెల్లారినట్లౌతుంది...
సకలం సాకారమౌతుంది..