Tuesday 26 May 2015

అశోకుడు చెట్లు నాటించెను..

"అశోకుడు చెట్లు నాటించెను.."
                              -  కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్ , 26.05.2015

    "అప్పుడెప్పుడో అశోకుడు నాటిన చెట్ల గురించి ఇప్పుడు మాకెందుకు సార్.. చరిత్ర ఉత్త చెత్త" అనేవాళ్ళో..అనుకునే వాళ్ళు కోకొల్లలు.. నిజంగా ఆ పాఠాలు ఇప్పుడు పిల్లలతో పాటు పెద్దలకీ వినిపించాలేమో .. !   లేకుంటే ..

ఏమిటీ విపరీతం.. ఎందుకీ దుస్థితి.. ఎవరు కారకులు...??

           గడిచిన వారం రోజులలో రెండు తెలుగు రాష్ట్రాల దీనస్థితి చూస్తుంటే..  నాకు చిన్నప్పుడెప్పుడో చూసిన "ఆదిత్య 369" చిత్రం గుర్తొస్తోంది.. కొద్ది రోజుల్లో మనం మర మనుషుల్లా.. వాతావరణం లోంచి వచ్చే వాయువులను తట్టుకోవడానికి మాస్క్ లు ధరించాలేమో..!


ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం  ప్రతి ఒక్కరికీ ఉంది.. ఇది నిజం.. మనం నిజం మాత్రమే మాట్లాడుకుందాం కాసేపు..

      నేను నేల మీద ఆంలెట్ వేశానేను మూడేళ్ల క్రితం అప్పుడు వడదెబ్బ మృతులు అతి తక్కువ నమోదయ్యాయ్.. అప్పుడు నమోదైన ఉష్ణోగ్రతలు 47- 48 వరకూ అత్యధికంగా, రామగుండం ని మించి భానుడు భగ్గుమన్నాడు..



        ఇప్పుడు గత రెండేళ్లలో కన్న ఉష్ణోగ్త్రతలు తక్కువే 43- 46 వరకే నమోదవుతున్నయ్.. కొండకచో 47 డిగ్రీలు.  అయినా  వృద్ధులు, పిల్లలు పిట్టల్లా నేలరాలుతున్నరు.. పండుటాకుల పరిస్థితి శోచనీయం. కనీసం గంటకు ఒకరుగా వడదెబ్బకు మృతి చెందుతుంటే ఒక జర్నలిస్టుగా నిశ్చేష్టుణ్ణయ్యా.. మృతిచెందిన వారిలో పదొకొండు రోజుల పసికందు నుంచి 75 ఏళ్ల వృద్ధుడి వరకూ ఉన్నారు.. ఆంధ్రా, తెలంగాణా వారితో పాటు అర్జెంటీనా యాత్రికుడు ఉన్నాడు..

ఒళ్ళంతా ఒకటే మంట.. ! ఉక్కపోత.. వరంగల్ లాంటి చోట ఆక్సిజన్ కూడా అందలేదని ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది..

మరి ఇంతమంది మృతి చెందడానికి ఎవరు కారణం..? ఈ పరిస్థితికి కారణం ఎవ్వరు..?
మనమే..! అని నాకనిపించింది. మనం వాడుతున్న ఫ్రిజ్ లు, ఏసిలు వగైరాలు ముఖ్యభూమిక పోషిస్తుంటే.. అడ్డగోలుగా చెట్లు నరకడం మరో దారుణం. మనల్ని ఇప్పుడు ఏ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాపాడలేవు..

  "పచ్చని చెట్టు మాత్రమే మనల్ని కాపాడ గలిగే ఏకైక అస్త్రం.".



ఇవి పాటిస్తే బావుండు...



 1. ప్రతి మనిషి కనీసం రెండు చెట్లను అధికారికంగా దత్తత తీసుకోవాలి..
 2. ఇళ్ళలో ఎవరైన పుట్టిన వెంటనే రెండు చెట్లు వారి పేరు మీద నాటాలి.
3. అవసరార్ధం ప్రభుత్వ సర్వెంట్లు చెట్టు నరకాల్సి వస్తే వారు వెంటనే పది చెట్లు నాటేలా చర్యలు తీసుకోవాలి.
4. ఇళ్ళలో జరిగే ప్రతి కార్యక్రమానికి గుర్తుగా ఒక చెట్టు నాటాలి.
5. పెద్ద కార్యక్రమాలకు అంతే పెళ్ళి వంటి కార్యక్రమాలలో ప్లాస్టిక్ డబ్బాలు..స్టీలు బొచ్చ్చెలు బదులుగా ఒక మొక్కను పంపిణీ చెయ్యాలి..

ఇలా వీలైనన్ని చెట్లు నాటడం చేసేందుకు ఇవే కాక,  మీకు వీలైన పద్దతులు ఎంచుకోవచ్చు..

పెరట్లో చెట్టు పెంచడం వల్ల భూగర్భ జలం అభివృద్ధి చెందే అవకాశం కూడా మెండుగా ఉంటుంది.. ఉదయం కాలం ఆక్సిజన్ ఇస్తుంది.  చక్కని నీడతో పాటు.. చల్లని గాలిని ఇస్తుంది..
                              
                             - మీ కరణం, 26.05.2015

No comments:

Post a Comment